చేర్యాల, మార్చి 13 : నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పట్టభద్రులు ఓటు వేసేందుకు చేర్యాలలో 2, కొమురవెల్లిలో 1, మద్దూరులో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేర్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సామగ్రి తీసుకుని బస్సుల ద్వారా శనివారం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పులతో పాటు గుర్తింపు కార్డులను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు మండలాలకు చెందిన 3,584 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2679 మంది పురుషులు, 905 మంది మహిళలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల విధులకు ప్రత్యేక బృందాలు..
ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 16మంది నోడల్ అధికారులు పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించనున్నారు. 6 ైప్లెస్కాడ్ బృందాలు, 6 స్పెషల్ వీడియో టీమ్స్, ఇద్దరు సెక్టోరియల్ అధికారులు, 2 మాస్టర్ ట్రైనర్స్, 5 సింగిల్ విండో సిస్టమ్స్, 5 ఎంసీఎంసీ టీమ్స్, 2 ఎస్ఎస్టీ బృందాలు, ఇద్దరు రూట్ అధికారులు, 8మంది కౌంటింగ్ టీమ్స్, ఆరుగురు ఏపీవోలు, 12మంది ఓఏపీవోలను నియమించారు. కాగా, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్..
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండల్లాలోని పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. మూడు ైస్లెకింగ్ ఫోర్స్, మరో 3స్పెషల్ ైస్లౌకింగ్ ఫోర్స్, 2మొబైల్ పార్టీలు, స్టాటిస్టికల్ ఆల్ సర్వైలైన్స్ బృందాలు 2 ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏసీపీ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 84మంది హెడ్కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న సీపీ ప్రకటించారు.