అన్నపురెడ్డిపల్లి: మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాలత మాట్లాడుతూ.. బృహత్ పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కల పెంపకం చేపట్టాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అగ్గి కవిత, ఎంపీడీవో రేవతి, ఎంపీవో షబ్న, సెక్రటరీ విజయ్కుమార్ పాల్గొన్నారు.