చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెండాలపాడు గ్రామంలో పల్లెపకృతివనంలో జరుగుతున్న కలుపునివారణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్ పక్రియను పూర్తి చేయాలని, ఎవరికివారు మరికొంతకాలం స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
కోవిడ్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ అన్నపూర్ణ, ఎంపిఓ తోట తులసీరాం, సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, జిపి సెక్రటరీలు లక్ష్మినారాయణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.