వేంసూర్: మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్క్ పనులను గురువారం సీఈఓ ఇంజం అప్పారావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మెగా పార్క్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. పార్క్లో ఆయన మొక్కలను నాటారు. అదేగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి మౌళిక వసతులపై ఆరాతీశారు. ముందుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శాఖల పనితీరు పర్యవేక్షణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
జెడ్పీ సీఈఓ మొదటి సారిగా రావటంతో ఎంపీపీ, అధికారులు పూలమాల, శాలువాలతో సన్మానించారు. ఆయన వెంట ఎంపీపీ పొగట్ల వెంకటేశ్వరావు, జెట్పిటీసీ సుమలత, ఎంపిడిఓ వీరేశం, ఎంపిఓ రంజిత్కుమార్, ఎంఈఓ వెంకటేశ్వరావు, ఏపీఓ కోటేశ్వరావు, సర్పంచ్ కె వెంకటేశ్వరావు, కార్యదర్శి రమేష్ నాయకులు పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.