చండ్రుగొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండ్రుగొండమండలంలో చోటు చేసుకుంది. బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా సురేష్(25) గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దేవుని లడ్డూను వేలంపాట నిర్వహించే క్రమంలో జనరేటర్ వర్షానికి ఆగిపోవడంతో ప్రత్యామ్నాయంగా కరెంటు లైన్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకున్నారు.
ఈ క్రమంలో మైక్ లో మాట్లాడేందుకు సురేష్ ప్రయత్నించటంతో వర్షానికి విద్యుత్ సరఫరా అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య,కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాజేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.