భువనగిరి అర్బన్, జూన్ 2: పదోతరగతి చదివి పరీక్ష రా సిన విద్యార్థులు రిజల్ట్ రాగానే ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సీటు పొందాలనే ఉత్సాహంతో దరఖాస్తులు చేసు కునే వారు. సీటు పొందాలంటే గతంలో విద్యార్థులు పదో తరగతిలో పొందిన ర్యాంకు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను పొందేది. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీట్లను ఎలా పొందాలానే ఆలోచనలో విద్యార్థులున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఏ కళాశాలలో సీటు పొందాలనే తోచలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇబ్బందులను తొలగించాలని నూతన విదానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో విద్యార్థులు ఇంటివద్దనే ఉండి విద్యార్థులకు నచ్చిన కళాశాలలో, నచ్చిన గ్రూపులో సీటు పొందేందుకు అవకాశం కల్పించడంతో వి ద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్లో ప్రవేశం…
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు-11, మోడల్ కళాశాలలు-7, కేజీబీవీ కళాశాలలు-5, రెసిడెన్సి కళా శాలలు-9 ఈ కళాశాలల్లో ఇంటర్లో విద్యార్థులు సీటు పొందేందుకు ఈ సంవత్సరం నుంచి ఇంటర్బోర్డు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో విద్యార్థులకు నచ్చిన ప్ర భుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులే నేరుగా ప్రవేశాలు పొందే అవకాశాన్ని ఇంటర్ బోర్డు అవకాశాన్ని కల్పిం చింది. ఆన్లైన్ ద్వారా స్వయంగా విద్యార్థులు తమకు నచ్చిన కో ర్సు , నచ్చిన కాలేజీల్లో చేరే అవకాశాన్నిచ్చింది. గతంలో విద్యార్థుల నుంచి దరకాస్తులు స్వీకరించి, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించిన ఇంటర్బోర్డు ఈ ఏడాది నుంచి విద్యార్థులే నేరుగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం వీటి ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు వీలుగా ఇంటర్ బోర్డు వెబ్సైట్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ను ఇచ్చింది. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఆన్లైన్లో www.tsbie.cgg.gov.in వెబ్సైట్ నందు ఈ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్ మొదటి విడుత ప్రవేశాలు మే 25 నుంచి ప్రారంభం కాగా, జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం
కల్పించిది. ఇంటర్లో ప్రవేశం పొందడానికి ఇదివరకు ప్రిన్సిపాల్ లాగిన్ ఐడీ ద్వారా వి ద్యార్థులకు ఆన్లైన్ ప్రవేశాలు కల్పించేంది.
కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలకు వెళ్లలేని కారణంగా ఈ సంవత్సరం నుంచి విద్యార్థులే ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం కల్పించింది. దీంతో ప్రవేశాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసే సెల్ఫ్ ఎన్రోల్మెంట్ పేజీలో పదో తరగతి హాల్టికెట్ నంబరును ఎంటర్ చేసి, తాము చేరదలుచుకున్న ప్రభుత్వ కాలేజీ పేరు ఎంపిక చేసుకొని ప్రవేశాలు పొందవచ్చు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
గత సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు నేరుగా కళాశాలలో తీసుకునేది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానానికి ఇంటర్బోర్డు అవకాశం కల్పించింది. 2021-22 విద్యా సంవ త్సరం ఏ కళాశాలలో చదవాలి, ఏ గ్రూపులో చేరాలి అనే వివరాలు ఆన్లైన్ ద్వారానే ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఆడ్మిషన్లు ప్రా రంభమయ్యాయి. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇంటర్ కళాశాలలో చేరాలనుకుంటే కళాశాల అధ్యాపకుల వాట్సాప్ నంబర్కు విద్యార్థి పదో తరగతి హల్ టికెట్ నంబర్, ఆధార్ నంబర్, ఎంపిక చేసుకున్న గ్రూపు, విద్యార్థి ఫోన్ నంబర్లను పంపాలి. భువనగిరి సీఎస్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలనుకుంటే కళాశాల అధ్యాపకుల ఫోన్ నంబర్స్ (7396375153, 995143811, 6304562912, 8147553125 )కు మెసేజ్ పంపాలి. విద్యార్థులు కోరిన గ్రూపులో ప్రవేశాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. – డి.పాపిరెడ్డి, సీఎస్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, భువనగిరి