దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీవరకు వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
భద్రాచలం నుంచి చర్ల వెళ్లే, వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్లే వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. వారోత్సవాల నేపథ్యంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీ తిరుపతి దుమ్ముగూడెం స్టేషన్ను సందర్శించి ఏజెన్సీలో భద్రత గురించి అడిగి తెలుసుకుని సూచనలు చేశారు