దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 15 నుంచి 18 ఏళ్లు కలిగిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్యామ్కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బాలాజీ, ఏఎస్ఎం, వైద్యసిబ్బంది, గురుకులం విద్యార్థులు పాల్గొన్నారు.