అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓ దశలో టీకా తీసుకోకపోతే ఆ యింటికి విద్యుత్, నీటి సరఫరా సైతం నిలుపుదలకు వెనకాడేదిలేదని అందుకు సహకరిస్తూ టీకా తీసుకోవాలని కోరారు.పేరాయగూడెంలో ఈఓ ఆర్డీ సీతారామరాజు, మేజర్పంచాయతీలో సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ గజవెల్లి హరికృష్ణలు విస్తృత ప్రచారం నిర్వహించారు.
వ్యాక్సిన్ వేసుకోకుంటే దైవదర్శనాలు, దూరప్రయాణాలతో పాటు అన్నిరకాల అవసరాలకు వ్యాక్సిన్ దృవపత్రం తప్పని సరి అని ప్రభుత్వాలు ఇప్పటికే నింబంధనలు జారీ చేశారని పేర్కొన్నారు. తద్వారా టీకా తీసుకునేందుకు సహకరించని యజమానుల ఇంటికి అన్ని రకాల సౌకర్యాలు నిలిపేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పేరాయగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, కార్యదర్శి శ్రీరామ్మూర్తి పంచాయతీ, వైద్య, ఐసిడియస్ సిబ్బంది పాల్గొన్నారు.