చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సీనియర్ నాయకులు మేడా మోహన్రావు, ఉన్నం నాగరాజు, దారా రత్నాకర్, సత్తి నాగేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు తదితరులు ఉన్నారు.