భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఈ సన్నాహక సమవేశాల్లో మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీలు, గ్రామ అనుబంధ కమిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. భద్రాచలంలో ఉదయం 9గంటలకు సమావేశం ప్రారంభమవు తుందని,దుమ్ముగూడెంలో ఉదయం11గంటలకు, చర్లలో 1గంటకు,వెంకటాపురం 2.30గంటలకు, వాజేడులో 3.30గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.