అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి, బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురులేదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు, నాయకులు సమిష్టి గా కృషి చేయాలని, టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, జడ్పీటీసీ భారత లాలమ్మ, ఎంపీపీ సున్నం లలిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు జంగాల ఉమా మహేశ్వరరావు,నున్నా బసవయ్య, కొత్తూరి వెంకటేశ్వరరావు, నేరళ్ల లాలయ్య, పోట్రు వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు, భారత రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు, గాలం కాటంరాజు, చల్లా రాంబాబు, నాగరాజు పాల్గొన్నారు.