దుమ్ముగూడెం :సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే జెండా పండుగను మండలంలో వాడవాడలా ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల సమయంలో తెలంగాణ సమాజం గర్వించేలా మన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండుగను మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతుబంధు నాయకులు, అభిమానులు తమ గ్రామాల్లోని వాడవాడల్లో జెండా పండుగకు హాజరై ఇళ్లపై టీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.