చండ్రుగొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారయణ పిలుపునిచ్చారు. మంగళవారం రావికంపాడు గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనా భూపతి రమేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గత మూడుసార్లుగా గ్రామశాఖ అధ్యక్షునిగా నియమితులవుతున్న రమేష్పై కార్యకర్తలకు ఎనలేని అభిమానం ఉందన్నారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలను ప్రవేశ పెడుతుందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు అబ్బాస్అలీ, గాలం రవి, తదితరులు పాల్గొన్నారు.