భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8గంటలకు జీయర్ మఠంలో తీర్థగోష్టి, 9.15గంటలకు జనరేటర్ ప్రారంభం, 9.30గంటలకు భద్రాద్రి రామయ్య సేవ, 10గంటలకు శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
10.30గంటల నుంచి 12.30గంటల వరకు మంత్రోపదేశములు, సాయంత్రం 4గంటలకు దేవస్థానం వైదిక-కార్యాలయ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం. 5.30గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, సాయంత్ర 6గంటల నుంచి సమతామూర్తి సందేశ సభ అనంతరం అభినవ దాశరథ శతకం ఆవిష్కరణ కార్యక్రమం. సెప్టెంబర్ 4న ఉదయం 8.30గంటలకు భద్రాద్రి రాముని సేవ, 9గంటలకు భద్రగిరి ప్రదక్షిణ, 10గంటల నుంచి 1గంట వరకు మాతృశ్రీ సవనము, 3గంటలకు వికాస తరంగిణి, జీయర్ మఠం సభ్యులతో ఆత్మీయ సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.