చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభలను ఎంపీపీ బాదావత్ శాంతి అధ్యక్షతన నిర్వహించారు. దీంతో పాటు నందాతండా పంచాయతీలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల సర్పంచ్లు, సెక్రటరీలు, కో-ఆప్షన్ మెంబర్లు, ఎంపీడీవో రమేష్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.