భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాదిత్య హీరోగా వంశం, మోహన్ బాబు హీరోగా రాజు-మహరాజు, వరుణ్ సందేశ్తో సరదాగా అమ్మాయితో సినిమాలకు పనిచేశానని అన్నారు. కన్నడంలో కూడా పలు చిత్రాలు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు.