భద్రాచలం: పుల్హామా దాడిలో అమరులైన జవాన్లకు స్థానిక టీఎన్జీఓస్ నాయకులు నివాళులర్పించారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం టీఎన్జీఓస్ అధ్యక్షులు డెక్కా నరిసింహారావు, అసోసియేషన్ ప్రెసెడెంట్ కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో పుల్హామా దాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ రక్షణలో జవాన్ల సేవలు వెలకట్టలేనివని, ప్రతి భారతీయుడి గుండెల్లో జవాన్లు దేవుళ్లుగా నిలిచి ఉంటారని తెలిపారు.
ప్రతి భారతీయుడు గుండె మీద చేయి వేసుకొని నిద్ర పోతున్నాడంటే జవాన్ల నిరంతర పర్యవేక్షణే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యదర్శి గగ్గూరి బాలకృష్ణ, నీటి పారుదల జిల్లా కార్యదర్శి శ్యామల శ్రీనివాస్, గాంధీ, లింగమూర్తి, మల్లిఖార్జున ప్రసాద్, ఈశ్వర్, బాషా, బ్రహ్మం, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, విజయకుమారి, చంద్రకళ, రాజేష్, సుబ్బారావు, మణేమ్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.