చండ్రుగొండ: సాంకేతిక లోపం తలెత్తినకారణంగా మంగళవారం బ్యాంకు సేవలు నిలిచి పోయాయి. దీంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగింది. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో టెక్నికల్ సమస్యరావడంతో బ్యాంకు వచ్చిన ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై బ్యాంకు అధికారులను ఆరా తీయగా పలుచోట్ల తలెత్తిన సాంకేతిక కారణంగా బ్యాంకు సేవలకు అంతరాయం కలిగిందని చెప్పారు.