పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(32) సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళుతుండగా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి ప్రాంతంలోకి రాగానే ఎదురుగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాశయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కాశయ్య కిన్నెరసాని గిరిజన సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో గత రెండేళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మృతిపట్ల గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.