మణుగూరు : ఓసీ-2 సమస్యలు జీఎం జక్కం రమేశ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు అన్నారు. ఓసీ-2 గనిని సందర్శించిన ఆయన కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాల్రోడ్లు మెరుగుపరిచేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 100 టన్నుల డంపర్లలో ఉన్నరేడియోలు తొలిగింపు చర్యలు నిలిపివేయాలని ఆయన కోరారు.
అధికారులతో మాట్లాడి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అబ్దుల్ రవూఫ్, వెంకటేశ్వరరెడ్డి, కాపాశివాజీ, అశోక్ కార్మికులు పాల్గొన్నారు.