జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మండలంలోని 21 మందికి మంజూరైన రూ.21, 2436 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూసేందుకు కళ్యాణలక్ష్మి ,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పెండ్లి సమయంలో మేనమామలా ఆదుకోవడం జరుగుతుందన్నారు.
పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ లూదర్విల్సన్, సహకారసంఘం అధ్యక్షులు లేళ్ల వెంకరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోని, జెడ్పీటీసీ భూక్యా కళావతి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్లపల్లి వీరభద్రం,ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదన్రావు, పొన్నెకంటి సతీష్కుమార్, పెండేల రాజశేఖర్,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు, నానాయకులు వేల్పుల నర్సింహారావు, రంగారావు, నాగేశ్వరరావు, ఖాజా రమేష్, మోదుగు రామకృష్ణ, పుల్లయ్య తదితరులు ఉన్నారు.