కొత్తగూడెం : జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని డిబార్ చేశారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ముగ్గురు, ఇల్లెందు డిగ్రీ కాలేజీలో ఇద్దరు, ఇల్లెందు సాహితి డిగ్రీ కాలేజీలో ఇద్దరు, ఖమ్మం గీతాంజలి డిగ్రీ కాలేజీలో ఒకరు చొప్పున ఎనిమిది మందివిద్యార్థులు డిబార్ అయ్యారు.