చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అందిస్తున్న విధానాల్ని ఆయన పరిశీలించారు. స్వయంగా రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని పలు విషయాలను గురించి ఆరా తీశారు.
ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీషర్ రాకేష్, హోమియో వైద్యులు ప్రవీణ్కుమార్, వైద్య సిబ్బంది ఇమామ్ ,శంకరమ్మ, పద్మ,లక్ష్మి, శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.