అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని జానకిపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకోదండ రామాలయంలో మంగళతోరణాలు, అభిషేకాలు, అర్చనలు , గోపూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. శ్రీ స్వామి వారి కళ్యాణం వేదమంత్రుల నడుమ శాస్త్రోక్తంగా జరిపించి, మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.