కొత్తగూడెం: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులకు క్యాన్సర్ స్క్రీనింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ శిక్షణను డీఎం అండ్ హెచ్వో డాక్టర్ జేవీఎల్ శిరీష ప్రారంభించారు. ఈ శిక్షణలో సర్వికల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై స్క్రీనింగ్ చేసేందుకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదే విధంగా ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో ఉన్న 30 ఏండ్లు నిండిన ప్రతీ మహిళకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి తద్వారా అనుమానిత కేసులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి పంపించాలని సూచించారు.
జిల్లాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 18 హెల్త్ వెల్నెస్ సెంటర్లు, 7 పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో పాటు ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, టీ హబ్ ప్రోగ్రాం ఆఫీసర్ భావ్సింగ్, డాక్టర్ స్వాతిశ్రీ, కో-ఆర్డినేటర్ రాంప్రసాద్, డిప్యూటీ డెమో ఎండీ ఫైజ్మొయినుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్కుమార్లు పాల్గొన్నారు.