అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సుధాకర్రావు మాట్లాడుతూ…గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో 6 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటామని, రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్ధతు ధర పొందాలన్నారు.
వర్షాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొసైటీ సీఈవో సున్నం వెంకటేశ్వర్లు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.