భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో అక్రమగా తరలిస్తున్న 8క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిరెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఆర్ఐ, వీఆర్వో ఏఎస్ఆర్ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ39టీసీ5887ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
సీజ్ చేసి బియ్యాన్నిరేషన్ ఆర్ఐ పర్యవేక్షణలో ఉంచారు. బియ్యాన్ని తరలించిన ఆటోను పోలీసులకు అప్పగించామని ఆర్ఐ నరసింహారావు తెలిపారు.