భద్రాద్రి కొత్తగూడెం : సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కమ్మరిగూడెం గ్రామం వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ భారీ వర్షాలకు నీట మునిగింది. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనుల కోసం గోదావరిలో కమ్మరిగూడెం సమీపంలో 600 మీటర్ల కాఫర్ డ్యామ్ను నిర్మించారు. భారీ వరద రావడంతో కాఫర్ డ్యామ్కు పలుచోట్ల గండ్లు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీటి పారుదల, స్థిరీకరణ కోసం భారీ ఎత్తున తలపెట్టిన ప్రాజెక్టుల్లో సీతారామ ఎత్తిపోతల పథకం ఒకటి. సుమారుగా పదిలక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీతమ్మసాగర్ పేరుతో రీడిజైన్ అయిన విషయం తెలిసిందే.