చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,నల్లి ఉదృతి,ముడత సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటి ఉదృతిని తట్టుకోవడం రైతులకు సలహాలు సైతం ఇవ్వటం జరిగింది.
శాస్త్రవేత్తల బృందంలో ఐఇఏఆర్-ఎస్సిఐపిఎం న్యూఢీల్లీ శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర, బెంగుళూరు శాస్త్రవేత్త రాచన్న, వ్యవసాయ కళాశాల పాలెం శాస్త్రవేత్త విజయలక్ష్మి, శాస్త్రవేత్తలు ఓపి వర్మ, అలంగిరి సిద్దక్,అధికారులు జినుగుమరియన్న,లక్ష్మినారాయణమ్మ,బానోత్ శివ,లాల్చంద్,నవీన్, సందీప్ తదితరులు పాల్గ్నొరు.