దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, సింగవరం, డబ్ల్యురేగుబల్లి, లక్ష్మీనగరం, ఆర్లగూడెం, కొత్తపల్లి, రామచంద్రునిపేట తదితర ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎంఈవో సున్నం సమ్మయ్య మాట్లాడుతూ మండలవ్యాప్తంగా 3346 మందికి తొలిరోజు 1843 మంది హాజరవ్వగా 55శాతం మేరకు విద్యార్ధుల సంఖ్య ఉండటంతో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారన్నారు.