అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లోని సావిత్రిబాయి పూలే, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేష్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీలు మాట్లాడుతూ ఆనాడు మహిళల సమానహక్కుల కోసం పోరాడిన మహనీయురాలు అని కొనియాడారు.
నేడు మహిళలు ఆమెను స్పూర్తిగా తీసుకుని అన్ని రంగాలలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు లింగిశెట్టి వెంకటేశ్వరావు, తాళం సూరి టీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ, ఫణింద్ర, సర్పంచ్ రమ్య, కేధర్నాధ్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.