భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలోని భీమునిగుడెంకు చెందిన మహిళ సర్పంచ్ కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు చైకీదార్గా మారారు. గ్రామం జనాభా మొత్తం 950. వీరిలో 130 మందికి కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో అధికారుల సంప్రదింపుల అనంతరం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు సర్పంచ్ మడకం పోతమ్మ తెలిపారు. కరోనా సోకిన వారిలో 60 మంది కోలుకున్నట్లు చెప్పారు. మిగతావారు హోం ఐసోలేషన్లో ఉన్నారన్నారు. స్థానిక ఆరోగ్య అధికారులు కొవిడ్ రోగులకు మెడికల్ కిట్లు అందజేశారు. కరోనా వ్యాప్తి నివారణకు గ్రామంలో శానిటైజేషన్ చేసినట్లు అదేవిధంగా గ్రామం నుండి ఎవరూ బయటకు వెళ్లకుండా అదేవిధంగా గ్రామంలోకి ఎవరూ రాకుండా కదలికలను నిలువరించినట్లుగా సర్పంచ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ చెక్పోస్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.