చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్యార్దులకు వ్యాసరచన, ముగ్గులపోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందినవారికి ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…దేశంలోనే అత్యధికంగా రైతుల కోసం నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతులను ఆర్దికంగా నిలదొక్కుకోవడం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, సర్పంచ్ మలిపెద్ది లక్ష్మిభవాని, ఎంపిటీసీ దారా వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి,పాఠశాల హెచ్ఎం మంజుశ్రీ ,గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, టిఆర్ఎస్ నాయకులు మాలోత్ భోజ్యనాయక్, సారేపల్లి శేఖర్, మద్దిరాల చిన్నపిచ్చయ్య, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.