చండ్రుగొండ: రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం తేవాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల్ని రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
యాసంగి వడ్లు కొంటరా ? కొనరా ? అనే విషయాలపై స్పష్టమైనా వైఖరి తెలుపాలని డిమాండ్ చేశారు. బిజేపి విధానాలపై దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్యనాయక్, పర్సా వెంకటేశ్వరరావు, సారేపల్లి శేఖర్ , రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, మాజీ సర్పంచ్ పాండ్ల అంజన్రావు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నం రామకృష్ణ, ద్రోణవల్లి చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.