ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో ఎవరైనా శుభకార్యాలు, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలనుకుంటే రైతువేదికలను ఉపయోగించుకుని అద్దె చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ సమావేశాల కోసం రోజుకు రూ.1000, ప్రభుత్వేతర సమావేశాలకు రోజుకు రూ.3వేలు, శుభకార్యాలకు రోజుకు రూ.6వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అద్దెకు కావాల్సిన వారు రెండు రోజుల ముందే మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.