భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు గురువారం సందర్భంగా బేడా మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. తాతగుడి సెంటర్లో ఉన్న శ్రీగోవిందరాజ స్వామివారికి అభిషేకం జరిపారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నిత్య హోమం, నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం జరిపారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణం నిర్వహించారు.