కొత్తగూడెం : నూతన సాగు చట్టాలు, వ్యవసాయ ప్రైవేటీకరణ, సంస్కరణల అంశాలతో తాను రూపొందించిన రైతన్న సినిమాకు కమ్యూనిస్టు పార్టీలు చూపిన ఆదరణ మరువలేనివని రైతన్న సినిమా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్పాషా తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక స్పృహతో నిర్మించిన చిత్రాలకు ఆదరణ కరువవుతోందని అన్నారు. యువత ఇలాంటి సినిమాల పట్ల ఆసక్తి చూకపోవడం బాధాకరమని చెప్పారు. సమాజాన్ని చైతన్యం పరిచే రైతన్న లాంటి సినిమాలను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాబీర్పాషా, వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ నూనావత్ గోవింద్, దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వీరస్వామి, వంగా వెంకట్, క్రిష్టోఫర్లు పాల్గొన్నారు.