కొత్తగూడెం: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది కూలీల ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.