భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మావోయిస్టు బాధిత ఆవాసాలలో నివసిస్తున్న ఆదివాసుల సంక్షేమం లక్ష్యంగా జిల్లా పోలీసులు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు సురక్షిత తాగునీరు అందేలా వాటర్ ఫిల్టర్లను పంపిణీ చేశారు. గత రెండు నెలల్లో 2,500 టెరాఫిల్ వాటర్ ఫిల్టర్లను పలు మండలాల్లో పోలీసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి ఆదివాసులను రక్షించడానికి వాటర్ ఫిల్టర్లు ఉపయోగపడుతాయన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా గిరిజనుల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం జిల్లా పోలీసులు వివిధ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలిపారు. వాటర్ ఫిల్టర్లతో పాటు డీటీహెచ్ కేబుల్తో కూడిన 66 టెలివిజన్ సెట్లను చర్ల, దుమ్ముగూడెం, గుండాలా, అల్పల్లి, కరాకగూడెం, ఎదుల్లా బయ్యారం, టేకులపల్లిలోని గుత్తికోయలకు పోలీసులు పంపిణీ చేశారు. ఆదివాసీల సమస్యలను తీర్చడంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడు ముందంజలో ఉంటారన్నారు. ఆదివాసీ యువత విద్యావంతులై మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు.