ములకలపల్లి : మండల కేంద్రంలో పవన్కల్యాణ్ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు గండి ముత్యాలమ్మ వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లి ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి మిఠాయిలు, పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు. నియోజకవర్గస్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా యువకులు పెద్దసంఖ్యలో వచ్చి రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పవన్కల్యాణ్ సేవాసమితి అధ్యక్షులు ఇనుకుర్తి రామాచారి(రాము), బైక్ మెకానిక్ సుభాని, ఎస్కె.రఫీపాషా, పొడియం ప్రేమ్కుమార్, సత్యప్రకాష్, పాండ్ర నరేష్, సాయి, రాము, చైతన్య, బచ్చల సురేష్, పొడియం వెంకట్ కృష్ణ, మహేష్, చామర్తి శివాజీ, సందీప్, ఆటో దినేష్ తదితరులు పాల్గొన్నారు.