దమ్మపేట : గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా సదుపాయం కల్పించాలని దమ్మపేట మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్ బాధ్యులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు, కార్యదర్శి పెరుమాళ్ల రాంబాబు, గొర్రెపాటి బసవయ్య, ధర్మారావు, ప్రభాకర్, ధర్మయ్య, నాగమణి, మండలంలోని 31 పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు.