పర్ణశాల : మండల పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జీసీసీ డీఎం కుంజా వాణి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నబండిరేవు, అంజిపాక, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యంలో 17శాతం తేమ లేకుండా చూసుకొని ఏఈవోలు ఇచ్చిన టోకెన్లతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
వానాకాలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మేనేజర్ శంకర్, సీసీ పీఏ బి.రాములు, బి.వెంకటేశ్వర్లు, జీసీసీ డీలర్ జార్జ్పాల్ తదితరులు పాల్గొన్నారు.