భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మొత్తం ఐదు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు అర్హత పత్రాల జిరాక్స్ను జతపరిచి ఈనెల 30లోగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గిరిజన వికాసపాఠశాలలో సమర్పించాలని కోరారు.