కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ మంటపాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని, కరోనా నుంచి బయటపడాలని ఆ బొజ్జ గణపయ్యను ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అఫ్జల్ ఉన్నీసా బేగం, పరమేష్ యాదవ్, వేమలు ప్రసాద్ బాబు, కామిశెట్టి సుజాత, బోయిన విజయ్కుమార్, ఎంపీపీ బాదావత్ శాంతి, టీబీజీకేఎస్ 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, సూరిబాబు, గణేష్ టెంపుల్ డైరెక్టర్ కూరగాయల శ్రీనివాసరావు, గౌస్, పితాని సత్యనారాయణ, బాలాజీ, మొయినుద్దీన్, షరీఫ్, సురేందర్, విజయ్, మజీద్, రూపేష్, రాజేష్, రమేష్లు పాల్గొన్నారు.