దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొలికపోగు కాంతారావు శనివారం పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 14న జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ మాదిగ విద్యార్థులు తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు.