చండ్రుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్1నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని ఎంపిడిఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని తిప్పనపల్లి , సత్యనారాయణపురం, రేపల్లెవాడ, గానుగపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలను పండుగలాగ ప్రారంభించాలని, ప్రతి విద్యార్థీ పాఠశాలకు వచ్చేలా,కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు ప్రారంభం రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేలా చర్యలు తీసు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట మండల పంచాయతీ అధికారి తోట తులసీరాం, గ్రామపంచాయతీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.