అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్దే విజయమని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా రంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతునిస్తున్నారని అన్నారు. మంగళవారం వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేశారు. బాణాసంచా కాల్చి సంబూరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
వ్యవసాయఅనుబంధ రంగాలు, కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ భవిష్యత్, ప్రజలు, రైతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలసమగ్రాభిద్దికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు శ్రీనివాసరావు, సత్యవరపు సంపూర్ణ, పసుపులేటి ఫణీంద్ర, నండ్రు రమేష్, తదితరులు పాల్గొన్నారు.