భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉదయం రామాలయానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ, భద్రుని కోవెల, దాసాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్ష, కార్యదర్శులు యశోద నగేష్, అరికెల్ల తిరుపతిరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.