కొత్తగూడెం: తాగునీటికి అంతరాయం కలగొద్దని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కిన్నెరసాని నుంచి కొత్తగూడెం పట్టణానికి నీటి సరఫరా చేసే పైప్లైన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొర్రేడువాగు ఉదృతంగా ప్రవహించడం వల్ల పైప్లైన్లు కొట్టుకుపోయాయని, దీని వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, వెంటనే ఆ పనులను యుద్ద ప్రాతిపదిన పూర్తి చేయాలనిఆయన అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… పట్టణంలోని నీటి సమస్యపై చర్చించారు. పట్టణంలోని ప్రతీ వార్డుకు ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంకులకు అదనంగా ట్యాంకర్లు తెప్పించి తాగునీరు పరఫరా చేయాలని సూచించారు.
కిన్నెరసాని నుంచి కొత్తగూడెం పట్టణానికి నీటి సరఫరాకు సంబంధించిన కాల్వ తండా వద్ద సబ్ స్టేషన్ పనులను, వాటర్ సంపు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి దసరా పండుగ లోపు పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కమిషనర్ అరిగెల సంపత్కుమార్, మున్సిపల్ ఏఈ, మిషన్ భగీరథ ఇంజనీర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.